Publish Date:Aug 10, 2025
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక భయం పట్టుకుంది. పులివెందుల పులి.. పులివెందులలో తిరుగే లేదు అని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో ఓటమి ఖాయమంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ పరాజయం పాలైతే.. ఆ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. ఎందుకంటే..పులివెందుల అంటే వైఎస్ కంటుకోట.. వైఎస్ తదననంతరం జగన్ కంచుకోట అని ఇంత కాలం చెప్పుకుంటూ తిరిగిన వైసీపీ నేతలకు ఇప్పుడు అక్కడే ఎదురు గాలి వీచడం జీర్ణం కావడం లేదు.
ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం, అదీ ఆరునెలలు మాత్రమే ఉండే పదవి కోసం వైసీపీ యంత్రాంగం మొత్తం పులివెందులలో తిష్ట వేసింది. అయినా విజయం పట్ల ధీమా కరవై కంగారెత్తిపోతున్నది. పులివెందుల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగి దశాబ్దాలు దాటిపోయింది. ఇక్కడ జగన్ కు, ఆయన పార్టీకి ప్రత్యర్థులుగా రంగంలోకి దిగడానికే భయపడే పరిస్థితి ఉండేది. దాదాపుగా ఇక్కడ స్థానిక ఎన్నికలన్నీ ఏకగ్రీవమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇక్కడ తెలుగుదేశం కూటమి అభ్యర్థిని నిలపడమే కాదు, గెలిపించుకుంటామని కూడా ధీమాగా ఉంటే.. ఇంత కాలం ఇక్కడ తమదే రాజ్యమని విర్రవీగిన వైసీపీయులు తమపై దాడులు జరుగుతున్నాయంటూ డ్రామాలు ఆరంభించేశారు.
ఈసీ వద్దకు వెళ్లి రక్షణ కావాలని మొరపెట్టుకుంటున్నారు. రిగ్గింగు చేసుకునే అవకాశం లేకుండా పోలింగ్ స్టేషన్లను మార్చేశారని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇక్కడి జనం మాత్రం ఇన్నాళ్లకు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి ఏర్పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలకుల విశ్లేషణల ప్రకారం వైసీపీ అధినేత సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఆయనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో పరాజయం ఎదురైతే.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై పడుతుందని జగన్ కూడా భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే తాను స్వయంగా పులివెందులలో ప్రచారానికి రాకపోయినా.. బెంగళూరు ప్యాలస్ నుంచి నిరంతరం ప్రచార తీరును పరిశీలిస్తున్నారు. పర్యవేక్షిస్తున్నారు. ఎంతగా దిశానిర్దేశం చేసినా పరిస్థితి అనుకూలంగా కనిపించడం లేదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఇక భయపెట్టి గెలిచేద్దామనుకుంటే.. పటిష్ట పోలీసు బందోబస్తు ఆ అవకాశం లేకుండా చేస్తున్నది. ఏది ఏమైనా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వైసీపీకి వ్యతిరేకంగా వస్తే..పార్టీ నుంచి వలసలు ఊహించని స్థాయిలో మొదలౌతాయన్న భయం పార్టీ అగ్రనాయతక్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pulivendula-zptc-by[oll-fear-in-ycp-39-203922.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది